pmmvy-scheme-eligibility-application-details
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన(PMMVY) కింద గర్భిణీలకు, బాలింతలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి సంతానానికి రూ.5 వేలు, రెండో సంతానం ఆడపిల్ల అయితే రూ.6 వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. మాతృత్వ సమయంలో పోషకాహారం, సరైన వైద్యం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
భారత్లో గర్భిణీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 2017 జనవరి 1న ప్రారంభమైన ఈ పథకం, తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని కోట్లాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు మాతృత్వ సమయంలో పోషకాహారం తగిన విశ్రాంతిని అందించడం కోసం ఈ నగదు సహాయాన్ని మోదీ ప్రభుత్వం అందిస్తోంది.
ఎవరికి ఎంత నగదు?
ఈ పథకం కింద అర్హులైన మహిళలకు రెండు వేర్వేరు సందర్భాల్లో ఆర్థిక సహాయం అందుతుంది. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు ప్రభుత్వం మొత్తం రూ. 5,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. మాతృత్వ వందన యోజన 2.0 మార్పుల ప్రకారం, ఒకవేళ రెండో సంతానం ఆడపిల్ల పుడితే, ఆ తల్లికి ప్రభుత్వం ఏకమొత్తంగా రూ.6,000 అందిస్తుంది. ఇది దేశంలో లింగ వివక్షను తగ్గించడానికి ఆడపిల్లల పుట్టుకను ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది.
ఈ నగదు మొత్తాన్ని ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, అవినీతికి తావులేకుండా సహాయం అందుతోంది.
FOR COMPLETE DETAILS CLICK HERE
FOR MORE DETAILS PDF CLICK HERE
