AP EAMCET 2026 Answer Key-response-sheet
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘ఏపీ ఈఏపీసెట్ 2026’ (AP EAPCET/EAMCET) రాసిన విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU), కాకినాడ.. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ (Provisional Answer Key) మరియు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను నేడు (మే 25, సోమవారం) ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేసింది. వాస్తవానికి ఈ కీ మే 23నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల దీనిని నేటికి వాయిదా వేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in ద్వారా తమ రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఈఏంసెట్ ఆన్సర్ కీ డౌన్లోడ్ ప్రక్రియ:
అభ్యర్థులు తమ అధికారిక సమాధానాల కీ మరియు రెస్పాన్స్ షీట్ను చెక్ చేసుకోవడానికి కింది వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది:
- వెబ్సైట్ను సందర్శించిన తర్వాత హోమ్పేజీలోని ఆన్సర్ కీ లింక్పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) మరియు ఈఏంసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) వివరాలను ఎంటర్ చేయాలి.
- వివరాలు సబ్మిట్ చేసిన వెంటనే మీ స్క్రీన్పై షిఫ్ట్ల వారీగా ఆన్సర్ కీ PDF ప్రత్యక్షమవుతుంది. దీనిని రెస్పాన్స్ షీట్తో పోల్చుకుని విద్యార్థులు తమకు రాబోయే మార్కులను ముందే అంచనా వేసుకోవచ్చు.
AP EAMCET 2026 Answer Key: ఆన్లైన్ అభ్యంతరాల స్వీకరణ (Objection Window) మరియు ఫీజు:
విడుదల చేసిన ప్రొవిజనల్ కీలో ఏవైనా తప్పులు లేదా తప్పుడు సమాధానాలు ఉన్నట్లు అభ్యర్థులు గుర్తిస్తే, వాటిపై ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలు (Objections) వ్యక్తం చేసేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ఈ అభ్యంతరాల స్వీకరణ విండో మే 25 ఉదయం 11 గంటల నుండి మే 27 ఉదయం 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభ్యంతరాలను దాఖలు చేసే సమయంలో విద్యార్థులు తమ లాగిన్ ఐడీతో పాటు, సదరు సమాధానం తప్పని నిరూపించే బలమైన డాక్యుమెంట్లు/ఆధారాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి ఛాలెంజ్ చేసిన ప్రశ్నకు రూ. 300 మేర నామినల్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు అభ్యర్థి చేసిన వాదన కరెక్ట్ అని నిపుణుల కమిటీ నిర్ధారిస్తే, వారు చెల్లించిన ఫీజును తిరిగి రీఫండ్ (వెనక్కి) చేస్తారు. ఈ విమర్శలన్నింటినీ పరిశీలించిన అనంతరం జూన్ 1న తుది కీతో పాటు ఫలితాలను కూడా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
